చంద్రబాబు ఓటమి నుంచి ఇంకా బయటికి తేరుకోలేదు. ఇంకా ఓటమి భాదలోనే ఉన్నాడు.  మనం ప్రజల్ని ఇంతలా బాధ పెట్టామా?  ఎన్ని కష్టాలకు గురి చేస్తే ఇలాంటి ఫలితాన్ని వారు ఇస్తారంటూ ఆత్మశోధన చేసుకుంటూ.. తనను కలుసుకోవటానికి వచ్చే నేతలతో తన ఆవేదనను.. ఆక్రోశాన్ని పంచుకుంటున్న ఆయన.. బయటకు రావటం లేదు.గెలుపోటములు జీవితంలో మామూలే.


అలాంటిది చంద్రబాబు ఈ ఓటమి నుంచి బయటకు వచ్చి.. డీప్ షాక్ లో ఉన్న పార్టీని పట్టాల మీదకు ఎలా తీసుకొస్తారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. దారుణ ఓటమి తర్వాత బాబు బయటకు వచ్చి పాల్గొనే కార్యక్రమం ఏది? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం తాజాగా వచ్చేసింది. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గుంటూరులో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు.


గుంటూరు టీడీపీ కార్యాలయం ఆవరణలోజరిగే కార్యక్రమంలో పాల్గొనే ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాధారణంగా ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి వేళ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈసారి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: