కుటుంబ క‌ల‌హాల‌తో రోజురోజుకు హ‌త్యలు, ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ల‌కు అన్నెంపున్నెం ఎరుగ‌ని పిల్ల‌ల మృతికి కార‌ణ‌మ‌వుతున్నాయి. భార్య చెప్పిన మాట విన‌డం లేద‌ని కొంద‌రు.. భ‌ర్త చెప్పిన మాట విన‌డం లేద‌ని.. కొంద‌రు ప‌నికిరాని విష‌యాల‌పై గొడ‌వ‌లు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల వ‌ర‌కు వెళ్తున్నారు. లేదా వారి పిల్ల‌ల‌పై త‌మ ప్ర‌తాపాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి తాజా ఘ‌ట‌న సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.


సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క‌న్న త‌ల్లే త‌న ఇద్ద‌రు పిల్ల‌లను క‌ర్క‌శంగా చంపేసింది. ఆమె చంపిన తీరును చూస్తూ వ‌ళ్లు గ‌గుర్పాటుకు గురిచేస్తుంది. సిద్దిపేట‌లోని గ‌ణ్‌న‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌రోజ అనే మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌లు ఆర్య‌న్‌(5), హ‌ర్ష‌వ‌ర్ధ‌న్(2) ల‌ను అతి కిరాత‌కంగా హ‌త‌మార్చింది ఆ క‌ర్క‌శ తల్లి.


అంతే కాదు.. ఆ పిల్ల‌ల నోట్లో గుడ్డ‌లు కుక్కి బీరు సీసాతో ఆ పిల్ల‌ల‌పై అతికిరాత‌కంగా దాడి చేసింది. కానీ, ఆ పిల్ల‌లు ఏ జన్మ‌లో ఏ పాపం చేశారో తెల్వ‌దు కానీ.. ఈ జ‌న్మ‌లో ఈ క‌సాయి త‌ల్లి చేతిలో చ‌నిపోవాల్సి వ‌చ్చింది. అనంత‌రం ఆ త‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయింది. 


ఈ విషాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లే ఈ హత్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాధ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. పిల్ల‌ల మృత‌దేహాల‌కు పంచ‌నామ నిర్వ‌హించారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: