ఆ మద్య టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై తొడగొట్టి సవాల్ విసిరిన పోలీస్ ...నువ్వ రాయల సీమ బిడ్డవైతే నేను రాయససీమ బిడ్డనే చూసుకుందామా అంటే చూసుకుందామా అంటూ మీసం మెలేసిన    గోరంట్ల మాధవ్ అందరికీ గుర్తుండే ఉంది కదా.  ఆయన నామినేషన్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.  మొత్తానికి హిందూపురం ఎంపీగా  గోరంట్ల మాధవ్ వైసీపీ పార్టీ తరుపు నుంచి గెలిచారు.  ఈ మద్య గోరంట్లకు ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తి సెల్యూట్ చేశారని తెగ వార్తలు వచ్చాయి. 

దీనిపై స్పందించిన గోరంట్ల తాను ముందు సెల్యూట్‌ చేసిన తర్వాత పై అధికారి బదులుగా స్పందించారని గోరంట్ల మాధవ్ చెప్పారు. తాను ఎంపీనైనా తనకన్నా పై అధికారులు ఎదరుపడితే ఇకపై కూడా సెల్యూట్‌ చేస్తానని చెప్పారు. యూనిఫామ్‌ ధరించిన పోలీస్‌ అధికారిగా స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు గుర్తించానని ఆయన చెప్పారు.

ఇప్పుడు ఖాకీతోపాటు స్టేషన్‌ను వదిలేసి ఖద్దరు ధరించి పార్లమెంటుకు వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే అంతకన్నా ఎక్కువ భయంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.  తనను ఎంపీగా సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని తలచుకుంటే భయం వేస్తోందని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడతానని మాధవ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: