దేశంలో ఎక్కడా లేని విధంగా రూపాయి ఖర్చు లేకుండా.. 32 వేల ఎకరాలు సేకరించామని చంద్రబాబు గత ఐదేళ్లుగా ఘనంగా చెప్పుకుంటున్నారు. అమరావతి భూసేకరణ దేశానికే ఆదర్శప్రాయమంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ భూసేకరణ, రాజధాని ఎంపిక విషయంలో  జరిగిన స్కామ్ అంతా ఇంతా కాదని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉంది. 


తాజాగా జగన్ తన ఢిల్లీ ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని ఘాటుగా ప్రస్తావించడంతో రాజధాని చుట్టుపక్కల భూములు కొన్న తెలుగుదేశం నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్ ఏమన్నారంటే.. రాజధాని ఎక్కడో చంద్రబాబుకు తెలుసు..అయినా ఎక్కడో వస్తోందని చెప్పి, చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ రేటుకు బూములు కొనుగోలు చేశారు. హెరిటేజ్ కంపెనీకి కూడా భూములు కొనుగోలు చేశారు. 

లాండ్ పూలింగ్ పేరుతో ప్రజల నుంచి భూములను తీసుకున్నారు. అదే సమయంలో తమ భూములకు మినహాయింపులు ఇచ్చారు. అంతేకాక భూములను తన ఇష్టం వచ్చిన రేట్లకు కట్టబెట్టారు.  అది మామూలు స్కామ్ కాదు..సంచలనమైందని జగన్ అన్నారు.  

అంతే కాదు.. ఈ అవినీతి వ్యవహారాన్నిపూర్తిగా బయటపెడతామన్న రీతిలో మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఆ చుట్టుపక్కల అడ్డగోలుగా భూములు కొన్న టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతే కాదు. చంద్రబాబు సర్కారు నుంచి అయాచితంగా తక్కువ ధరకే భూములు కొన్న వారు కూడా ఇప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: