ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుట ఎగుర వేసిన వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ, సినీ, పారిశ్రామిక వర్గాల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఇక ఈ నెల 30 న సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ని కొంత మంది స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతుంటే..మరికొంత మంది ఫ్లెక్సీలు...దేవాలయాల్లో పూజలు, అన్నదానాలు, స్వీట్లు పంచుతూ ద్వారా  శుభాభినందనలు తెలుపుతున్నారు.


అయితే తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ ని సామాన్యులు సైతం కలిసి తమ శుభాకాంక్షలు తెలపాలని ఉవ్వళ్లూరుతున్నారు..కానీ కొన్ని భద్రతల దృష్ట్యా అది కుదరడం లేదు. అలాంటి వారి కోసం వైసీపీ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.  జగన్ అభిమానుల కోసం 99127 90699 నెంబర్ ను  ప్రత్యేకంగా విడుదల చేసింది.

ఈ నంబర్ కు వీడియో లేదా ఆడియో రూపంలో పేరు, ఊరు పేర్కొంటూ వాట్సాప్ ద్వారా అభినందనలు పంపవచ్చని పేర్కొంది. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో సాక్షి దినపత్రిక కార్యాలయాల్లో బాక్స్ లు ఉంచామని, శుభాకాంక్షలు రాసి అందులో వేయవచ్చని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: