పెన్షన్ దారులకు శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభత్వం. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్లను రెట్టింపు చేస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించగా... ఆ హామీని అమలు చేయడానికి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

పెంచిన పింఛన్లు జూన్ నెల నుండి వర్తిస్తాయని, జులై లో ఆ మొత్తాన్ని లబ్దిదారులకు అందిస్తామని అధికారులు తెలిపారు. ఆసరా పేరుతో ప్రారంభించిన పింఛను ఇప్పటివరకు రూ. 1000 ఇస్తుండగా దానిని రెట్టింపు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. 


వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు రూ. 1000 ఉండగా ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2,016 అందనున్నాయి. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు రూ. 1500 ఉండగా దానిని రూ.3,016 చేసి ఇవ్వనున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: