నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం స్థానిక, జాతీయ స్థాయిలో నాయకులందరికీ ఆహ్వానాలు అందాయి.  ఇప్పటికే తెలంగాణ నుంచి కేసీఆర్ ఇతరు మంత్రి వర్గ సభ్యులు విజయవాడకు చేరుకున్నారు.  మరోవైపు వైసీపీ అగ్ర నేతలతో సందడి వాతావరణం నెలకొంది. 

తాజాగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సదర్భంగా తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్‌ విజయవాడ చేరుకున్నారు.  చెన్నై నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న స్టాలిన్‌కు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీఎంకే అభిమానులు స్వాగతం పలికారు.

గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో స్టాలిన్‌ విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకార సమయానికి స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకోనున్నారు. ప్రస్తుతం నేతల తాకిడితో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం కిక్కిరిసి పోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: