నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు టర్ములు సిఎంగా ఉండాలని కెసియార్ కోరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన కెసియార్ మాట్లాడుతూ తండ్రి వైఎస్ లాగే మంచి పరిపాలకునిగా జనాల మన్ననలు అందుకోవాలని ఆశీర్వదించారు.

 

గోదావరి, కృష్ణా జలాలను సంపూర్ణంగా వాడుకోవటమే జగన్ ముందున్న అతిపెద్ద సవాలుగా కెసియార్ గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య కావాల్సింది ఖడ్గచాలనం కాదని కరచాలనమంటూ చమత్కరించారు.  నదీ జలాల వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు.

 

ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఒక్క టర్మకు మాత్రమే కాదని మరో మూడు నాలుగు టర్ములు కూడా సిఎంగానే ఉండాలని, వైఎస్ పేరు నిలబెట్టాలంటూ కెసియార్ నిండు మనసుతో జగన్ ను ఆశీర్వదించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: