ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్రాణాల‌కు ముప్పుంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే జ‌రిగిన దాడికి తోడుగా మ‌రో దాడి ఖాయ‌మ‌ని ఉంద‌ని పేర్కొన్న వేణుస్వామి...ఇదే విష‌యాన్ని తాను వైఎస్ జ‌గ‌న్‌కు సైతం వెల్ల‌డించాన‌ని సంచ‌ల‌న అంశాలు వెల్ల‌డించారు.


ఓ మీడియా సంస్థ‌తో వేణుస్వామి మాట్లాడుతూ, వైఎస్ జ‌గ‌న్ న‌క్ష‌త్రం ఆరుద్ర అని, మిథున రాశి అని పేర్కొంటూ....శ‌ని హోరులో ఉన్నారని వెల్ల‌డించారు. ఈ కార‌ణాల వ‌ల్ల‌ ...ఆయ‌న‌పై శ‌త్రువుల యొక్క దాడి మ‌రోమారు ఉండే అవ‌కాశం ఉందని హెచ్చ‌రించారు. `కోడిక‌త్తి దాడి కాకుండా...ఈ ద‌ఫా ఆయ‌న‌పై పెద్ద దాడి జ‌రిగే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారిపై శ‌త్రువులు చేసే దాడిని క‌నుక త‌ప్పించుకోగ‌లిగ‌డం పెద్ద స‌వాలు. ఇదే విష‌యాన్ని నేను వైఎస్ జ‌గ‌న్‌కు తెలిపాను. 


తొలి అటాక్ సాధార‌ణంగా ఉంటుంద‌ని, రెండో అటాక్ భారీగా ఉంటుంద‌ని తెలిపాను. దానికి సంబంధించిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటాను అని జ‌గ‌న్‌ తెలిపారు.  మీరు ఏవైనా చేయ‌గ‌లిగితే రెమెడీ చేయండి అని జ‌గ‌న్ న‌న్ను కోరారు`` అంటూ వేణుస్వామి వెల్ల‌డించారు.  ఈ దాడి హెచ్చ‌రిక నేప‌థ్యంలో, పోలీసు వారితో పాటుగా ఇత‌ర‌త్రా మంత్రుల‌ను జ‌గ‌న్‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మీపై ఉందని కోరుతున్న‌ట్లు వేణుస్వామి తెలిపారు.

``జ‌గ‌న్‌కు 2020 ఏప్రిల్ 24 నుంచి అష్ట‌మి శ‌ని ప్రారంభం అవుతోంది. అష్ట‌మ శ‌ని ఆయ‌న‌కు క‌ష్ట‌కాలంగా మారే అవకాశం ఉంది. అకాశ‌మార్గంలో ప్ర‌య‌ణిస్తున్న‌ప్పుడు కావ‌చ్చు...సాధార‌ణ ప్ర‌యాణాల్లో అయి ఉండ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని గ‌మ‌నంలోకి తీసుకోవాలి.`` అని వేణుస్వామి విశ్లేషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: