తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం పెంచుతూ ఉత్తర్వులు.
డీఏ పెంచడంతో తెలంగాణ ఉద్యోగుల మూల వేతనం 30.392 శాతానికి చేరింది. పెరిగిన డీఏను జూలై 2018 నుంచి మే 2018 వరకు జీపీఎఫ్ ఖాతాలో కలుపుతారని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మొత్తంగా 27.248 శాతం నుంచి 30.392 శాతానికి డీఏ పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.