తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో పెనుమార్పులు రానున్నాయా..?? భవిష్యత్తులో బీజేపీ తెలుగు రాష్టాలలో పాగా వేయడానికి చంద్రబాబు, టీఆర్ఎస్ లని టార్గెట్ చేయనుందా...?? ఇప్పటికే టీడీపీ కీలక నేతలని టార్గెట్ చేసిన కేంద్ర తన నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు పైనే గురి పెట్టిందా అంటే అవుననే అనాల్సి వస్తోంది తాజా పరిణామాలని చూస్తుంటే.తెలంగాణలో తాజా ఎన్నికల్లో బీజేపీ కి వచ్చిన ఆదరణ చూసిన కమలనాధులకి తెలంగాణపై పూర్తి స్థాయిలో పట్టు సాధించగలం అనే నమ్మకం ఏర్పడింది. టీఆరెస్ ని డీ కొట్టగలిగే సత్తా తమకే ఉన్నదనే దిశగా వ్యుహాలని సిద్దం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్రలో కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పడంలో సందేహంలేదు. ఇదిలాఉంటే

 Image result for chandrababu vs bjp

ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులలో టీడీపీ పార్టీ కోలుకోవడం అసంభవమనే చెప్పాలి.గడిచిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు మరో పదేళ్ళ వరకూ కొనసాగినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ టీడీపీ అధినేతని ఇరుకున పెట్టె వ్యుహాలకి పదును పెడుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఎలా అయితే పట్టు సాధించాలని భావిస్తోందో, ఏపీ పై కూడా పట్టు పెంచుకోవాలని అనుకుంటోంది. అయితే జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న చరిష్మా కారణంగా తనని ఇప్పటిలో డీ కొట్టలేమని భావిస్తున్న బీజేపీ, జగన్ తో స్నేహభంధం సాగిస్తూనే టీడీపీని కూకటి వేళ్ళతో పెకిలిచే ప్రయత్నాలు చేస్తోంది.

 Related image

చంద్రబాబు పై తీవ ఆగ్రహంగా ఉన్న బీజేపీ, టీడీపీ హయంలో జరిగిన అవినీతిపై లెక్కలు కడుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తప్పకుండా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నివేదికలు త్వరతగతిన జగన్ టేబుల్ మీదకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోనే బీజేపీ రంగంలోకి దిగి చంద్రబాబు అరెస్ట్ కి సర్వం సిద్దం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. దాంతో ఏపీలో టీడీపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే ప్రణాళికలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తతంగం అంతా షా కనుసన్నల్లోనే జరగనుందని, పక్కా వ్యూహంతో చంద్రబాబు అరెస్ట్ ఉండబోతోంది అనే సూచనలు మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాలని బట్టి అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: