ఇక, గుంటూరు జిల్లాలో కేబుల్ వ్యాపారం నిర్వహించిన శివరామకృష్ణ.. పలువురు వ్యాపాలను మోసం చేసి మరీ రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు గత రాత్రి నుంచి కోడెల శివరాం కి సంబందించి హైదరాబాద్, గుంటూరు లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లి పోలిసులు సహా ఈడి అధికారులు కూడా ఉన్నారని సమాచారం. అయితే, ఇదంతా కూడా కేబుల్ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్న సోదాలేనని, ఇందులో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని అంటున్నారు.
శివరాంపై కేసులు పెట్టిన కంపెనీలు.. పైరసీ ద్వారా కేబుల్ కనెక్షన్ వ్యాపారం చేసి సుమారు 70 కోట్లు కేబుల్ కంపెనీలకు ఏగ్గోట్టినట్లు కోర్టు కి ఆదారాలు సమర్పించాయి. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.. భారత దేశ చరిత్ర లో ఇంత భారి స్దాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదే అని కోర్టు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అణువణువును గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లి పోలిసులు కోడెల శివరామకృష్నను ఏక్షణానైనా అరెస్టు చేసెందుకు సిద్దమైనట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన విచ్చలవిడి దోపిడీకి ఇప్పుడైనా అడ్డుకట్ట పడుతోందని వ్యాపారులు ఆనందిస్తున్నారు.