సీఎంగా ప్రమాణంగా చేసిన నాలుగు రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు వై యస్జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్ పిల్లల కోసం ప్రతి శనివారం నో బ్యాగ్ డే అనే కొత్త ఆలోచనకు శ్రీకారంచుట్టారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


చిన్న వయసులోనే ఎక్కువ మొత్తంలో బరువు ఉన్న బ్యాగ్ లను మోయటంతో కొందరు పిల్లల్లోనడుము నొప్పి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో పిల్లలు ఆటలుఆడుకోవడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటానికి, మానసిక ఆనందానికి అవకాశం ఉంది.


ఇకపై ప్రతి రెండవ, నాలుగవ శనివారాలు పిల్లలు పూర్తిగా ఆట పాటలకే పరిమితమవుతారు. నిర్ణయంతో పిల్లలు ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది. అంతేకాక ఈ నిర్ణయంతోబడి అంటే పిల్లలకు ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: