వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతున్నారు. గతంలోని జగన్ కు ఇప్పుడున్న జగన్ కు చాలా తేడా కనిపిస్తోంది.  జగన్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా శ్రద్ధను చూపిస్తున్నారు.  
ఇదిలా ఉంటె, జగన్ లో చాలా మార్పు వచ్చిందని సినీనటుడు జెడి చెప్పడం విశేషం. హిప్పీ సినిమా ప్రమోషన్ కోసం జెడి ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.  ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పేర్కొన్నాడు. 
2008 వ సంవత్సరంలో తాను విమానంలో ప్రయాణించే సమయంలో తన కాలుకు దెబ్బతగలడం వలన వీల్ చైర్ కావాలని అడిగానని, ఆ సమయంలో జగన్ పక్కనే ఉన్నాడని, కానీ జగన్ తనతో అసలు మాట్లాడలేదని అన్నారు.  
అప్పట్లో ఆ జగన్ కు సంవత్సరం క్రితం తాను చూసిన జగన్ కు చాలా తేడా ఉన్నట్టు తెలిపారు. గతేడాది జగన్ విమానాశ్రయంలో కలిశారట.  జగన్ తనను చూసి ఎలా ఉన్నారు అని పలకరించాడని జెడి చెప్పాడు.  జగన్ లో చాలా మార్పులు వచ్చాయని, జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పారు జెడి.


మరింత సమాచారం తెలుసుకోండి: