ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపానల చూస్తుంటే అన్నం మొత్తం ఉడికిందా అనేదానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుందని అంటారు.  ఇప్పుడు జగన్ దూకుడు..పరిపాలనా విధానం చూస్తుంటే భవిష్యత్ లో ఆయన పాలన ఎంత గొప్పగా సాగుతుందో అనడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు..చాటుతున్న మంచితనం అందుకు నిదర్శనం అని చెప్పొచ్చు.  ఆ మద్య వైజాగ్ లో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కలవడానికి మొదటి సారి వైజాగ్ వచ్చిన ఆయనను కొంత మంది విద్యార్థులు తమ స్నేహితుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని చెప్పగానే వెంటనే  కలెక్టర్ కి ఆ బాధితుడికి రూ.25 లక్షలు వైద్య ఖర్చుకోసం మంజూరు చేశారు.

తాను కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొంతమంది బాధితులు వస్తే వాహనం ఆపి మరీ వారి బాధలు తెలుసుకొని వాటిని తీరుస్తానని భరోసా ఇచ్చారు.  తాజాగా సీఎం జగన్ ఎంత మంచి వారో అన్న విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  తాజాగా గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ బహిరంగ సభలు జరిగినా..అక్కడ నన్నూరి నర్సిరెడ్డి ప్రత్యక్షం కావడం..ఇక జగన్ ని టార్గెట్ చేసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందడం కోసం నానా తంటాలు పడే వారు. 

ఆ మద్య తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో అందరూ చూస్తుండగా జగన్ గురించి ఓ పిట్ట కథ చెప్పాడు.  జగన్ ని ఒక దొంగగా చిత్రీకరించి వెంకటేశ్వరస్వామి, మంగమ్మ అంటూ ఒక కథ చెప్పారు..ఆ సమయంలో టీడీపీ శ్రేణులు పగలబడి నవ్వుకున్నారు..ఆ పిట్ట కథ సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది.  కట్ చేస్తే  ఇప్పుడు ఏపిలో వైసీపీ పాలన వచ్చింది..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.  అయితే గతంలో తనపై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసి సెటైర్లు వేసిన  నన్నూరి నర్సిరెడ్డి పై ఏ రేంజ్ లో కోపం తెచ్చుకుంటారో అని అనుకున్నారు..కానీ సీఎం జగన్ అలా చేయలేదు..సరికదా  నన్నూరి నర్సిరెడ్డి కళ్లు చెమ్మగిల్లేలా ఆయనకు అతిథి మర్యాద చేశాడు. 

ఆయనను ఇంటికి పిలుపించుకొని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసి..తనతో పాటు విందు ఏర్పాటు చేసి సంతోష పరిచారు.  అంతే కాదు బోజనం అయ్యాక.. నన్నూరి నర్సిరెడ్డి కి తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు బహుమానంగా ఇచ్చి..గతంలో మీరు చేసిన కామెంట్ నాలో ఇంకా కసిని పెంచిందని..ఎలాగైనా సీఎం కావాలనే లక్ష్యం నా ముందు ఉంచిందని మీరు అన్నదానికి నేను బాధపడటం లేదని..అంతే కాదు మీకు ఇక నుంచి ఎలాంటి అవసరమున్నా నేనున్నానన్న విషయం మర్చిపోకండి అని భరోసా ఇచ్చారు.  అది చూసి  నన్నూరి నర్సిరెడ్డి కళ్లు చెమ్మగిళ్లాయట..ఇక నుంచి ఎవరిపై పడితే వారిపై ఇలాంటి వ్యంగ్యమైన కామెంట్స్ చేయనని జగన్ కి హామీ ఇచ్చారట.  ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తగా మాత్రమే మీకు అందిస్తున్నాం.


మరింత సమాచారం తెలుసుకోండి: