సీనియర్ జర్నలిస్టు, గత 9 ఏళ్ళుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుక అయిన శ్రీ జీవీడి కృష్ణ మోహన్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు(కమ్యూనికేషన్స్) గా ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


శ్రీ జీవీడీ గురించి క్లుప్తంగా..


శ్రీ జీవీడి... గత 9 ఏళ్ళుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతుక అయ్యారు. ఈనాడులో జర్నలిజం ప్రారంభించి..  అంతర్జాతీయ అంశాలు, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాలు.. తదితర అంశాలపై ఎడిటోరియల్ పేజీలో కాలమ్స్ రాస్తూ.. ఈటీవీలో మావోయిస్జు నాయకుడు ఆర్కే(అక్కిరాజు హరగోపాల్- రామకృష్ణ)తో ముఖాముఖి చేసి జర్నలిస్టుగా ఆయన ఎంతో పేరుగడించారు.


ఆ తర్వాత సాక్షి ఆవిర్భావ సమయంలో ఆ పత్రికలో చేరి.. అనతి కాలంలోనే ఏది నిజం.. ద్వారా వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన అవినీతిని చీల్చి చెండాడిన ఏకైక జర్నలిస్టు ఈయన. 
అప్పటి నుంచే  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారికి,  ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి దగ్గరై.. అప్పటి నుంచి నేటి వరకూ ప్రతి కష్టంలో.. నష్టంలో వైయస్ఆర్ గారి కుటుంబం వెంట నడిచిన వ్యక్తి, జర్నలిస్టు శ్రీ జీవీడీ. 


 2011 మార్చి 12న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే.. ఈ పార్టీతో, వైయస్ఆర్ కుటుంబంలో ఒకరిగా శ్రీ జీవీడి మమేకమై.. పార్టీకి గొంతుకగా పార్టీని నడిపించారు. మీడియాలో పార్టీ వాణిని సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించేందుకు ఎందరికో తర్ఫీదు ఇచ్చి ఎన్నో గొంతుకలను పార్టీ కోసం తయారు చేసిన  పొలిటికల్ మాస్టారు శ్రీ జీవీడి.


పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిగారి రాజకీయ ప్రస్థానంలో ఆయనకు ఎదురైన ప్రతి కష్టంలో.. ప్రతి బాధలో.. జీవీడీ ఆయనకు తోడుగా నిలబడ్డారు. అందుకే జగన్ గారి గెలుపుతో.. జీవీడీ గారికి ఈ విధంగా విజయం సిద్ధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: