ఉత్తరాంధ్రకు ఉప ముఖ్యమంత్రి ఈసారి దక్కుతోంది. టీడీపీ హయాంలో గోదావరి జిల్లాల వరకూ వచ్చిన ఆ కీలకమైన పదవి ఈసారి ఉత్తరాంధ్ర  బోర్డర్ ని టచ్ చేసింది. విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కొత్త ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ మేరకు ఆమె రేపు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు.


వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎస్టీ కోటాలో మహిళగా పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం అవుతున్నారు. అంతే కాదు. ఆమెకు కీలకమైన మంత్రిత్వ శాఖలే కేటాయిస్తారని తెలుస్తోంది. పుష్ప శ్రీవాణికి మొదటి నుంచి జగన్ని నమ్ముకుని రాజకీయం చేశారు. ఎందరో ఫిరాయించినా కూడా ఆమె మాత్రం పార్టీని వీడలేదు.


ఇక పాదయాత్ర సందర్భంగా జగన్ ఆమెను గెలిపిస్తే మిగతా సంగతి తాను చూసుకుంటానని జనం సాక్షిగా హామీ ఇచ్చారు. దానికి ప్రతిఫలం గా ఈసారి మంత్రి పదవే కాదు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవే వరించనుంది. దీంతో గిరిజన వర్గాలల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: