టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఓటమి తో నిరాశలో కి వెళ్ళినా పార్టీని ఇప్పుడు ఒక తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఓటమికి చేసిన సమీక్ష సమావేశాలను పూర్తి చేసుకొని ఇప్పుడు అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడిగా అడుగు పెట్టనున్నారు.

టీడీపీ నుండి 2019 ఎన్నికలలో బాబు గారు ఒక్కరే రాష్ట్రమంతా తిరిగారు.ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరికి మాత్రమే పరిమితం అయ్యారు.అలాగే తన వియంకుడు బాలయ్య కూడా ఎన్నికల సమయం లో  హిందూపురానికి అంకితం అయ్యారు.ఫలితాలు అయ్యాక దారుణ ఓటమిని చూడడంతో టీడీపీ నాయకులు,కార్యకర్తలు ఇళ్లకు పరిమితం అయ్యారు.

ఎన్నికల ప్రచారంలో వన్ మ్యాన్ ఆర్మీ గా పని చేసిన బాబు గారు.ఫలితాలు వచ్చాక కూడా వన్ మన్ అర్మీగా ప్రెస్ ముందుకు వచ్చారు.ఇప్పటికీ టీడీపీ నాయకులు మీడియా ముందుకి రావడానికి ఇష్ట పడటం లేదు.దానితో టీడీపీ పరిస్థితి చూసి అధికార పార్టీ వైసీపీ సంబర పడుతుంది.

అలాగే తమ నాయకులలో ఉత్సాహాన్ని నింపడానికి టీడీపీ సోషల్ మీడియా వింగ్ పెడుతున్న పోస్ట్ లకు మరియు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ వేస్తుంది వైసీపీ.ఇలా టీడీపీ అధ్యక్షుడు బాబు గారి ఒంటరి పోరు పై కొద్దిగా జాలి చూపకుండా వైసీపీ కార్యకర్తలు టీడీపీ వారితో మరింతగా ఆడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: