ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారికి..


నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్న శుభ సందర్భంలో మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు..
మంత్రివర్గ విస్తరణలో మీ నిర్ణయం 'సామాజిక విప్లవానికి నాంది' గా నేను భావిస్తున్నానను.
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బలహీన మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఎవరు ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకం గా నేను భావిస్తున్నాను.. పరిణితి చెందిన ప్రజా నాయకుడిగా మీరు స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం.
ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా, పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన మీరు 'రాజకీయాలలో రియల్ హీరో'..
మీరు, మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నా గట్టి నమ్మకం.. రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానను..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..


ఇట్లు
యూ.వి.కృష్ణంరాజు
కేంద్ర మాజీమంత్రివర్యులు
బీజేపీ సీనియర్ నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: