ప్రముఖ సంచలన దర్శకుడు ఆర్.జి. వి తన చిత్రాలతో మరియు వ్యాఖ్యలు తో ఎప్పుడూ వార్తలలో నిలుస్తూవుంటారు.అయన ప్రముఖ లను విమర్శిస్తూ వారి అభిమానులు చేసే కామెంట్లకు కౌంటర్ ఇస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు.

లక్ష్మీ ఎన్.టి. ఆర్ చిత్రాన్ని నిర్మించి చంద్రబాబు గారి అభిమానులతో మరియు టీడీపీ కార్యకర్తల తో ఒక ఆట ఆడేసుకున్నారు.ప్రస్తుతం ఆయన పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్నటిదాకా టీడీపీ ని టార్గెట్ చేసిన ఆర్.జి. వి ఉన్నట్టుండి పవన్ మీద ఎందుకు పడ్డారని సోషల్ మీడియా లో ఇప్పటికే పవన్ అభిమానులు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.

పవన్ ఓటమి తర్వాత తనను ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు దాదాపు 150 కోట్లు ఖర్చుపెట్టాయిని ఆయన ఆరోపించారు.దానికి కౌంటర్ గా ఆర్.జి.వి పవన్ ప్రజలు  డబ్బు తీసుకొని ఓటు వేశారని అనడం సరైన పద్దతి కాదని ఒకవేళ పవన్ తమకు అవసరం అనుకొని ఉంటే డబ్బు తీసుకున్నా పవన్ నే గెలిపించే వారని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: