తమతో ఉన్నప్పుడు మునుగ చెట్లు ఎక్కించేలా పొగడడం.తమని కాదనప్పుడు తక్కువ చేసేలా తిట్టి పోయడం రాజకీయ పార్టీలకు మరియు రాజకీయ నాయకులకు అలవాటు.బీజేపీ తో కలిసి పని చేసి తమకు విజయాన్ని అందించిన పీకే  ఇప్పుడు తమ ప్రత్యర్థులుతో కలిసి పని చేస్తూ ఉండడం తో అతడి పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ ఆంధ్రా ప్రదేశ్ లో  అనుసరించిన వ్యూహాలు వల్ల నలభై యేళ్ళు అనుభవం ఉన్న చంద్ర బాబు దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.అందుకే మమత బెనర్జీ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ వల్ల దెబ్బ తినడంతో ప్రశాంత్ కిషోర్ ని తమ పార్టీకి వ్యూహా కర్తగా నియమించుకున్నారు.

బెంగాల్ బీజేపీ నేతలు ఇప్పుడు మమత బెనర్జీ ని టార్గెట్ చెయ్యడం పక్కన పెట్టి ప్రశాంత్ కిషోర్ ను టార్గెట్ చేస్తున్నారు.అందులో భాగంగా బీజేపీ నేత కైలాష్ ప్రశాంత్ కిషోర్ ఓ బచ్చా అని అమిత్ షా ను మించిన వ్యూహా కర్త లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యూహా కర్తగా తను పని చేసిన పార్టీలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్ బెంగాల్ లో బలహీన పడుతున్న తృణమూల్ ను మళ్ళీ గాడిలో పెట్టగలారా అనే సమాధానం కోసం వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: