మోడీ ఆంధ్ర ప్రజల పాలిట విలన్.. ఇది నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం నేతలు చేసిన ప్రచారం. కానీ ప్రచారాన్ని జనం అంతగా నమ్మినట్టు లేరు. నమ్మితే వైసిపి అంత ఘనవిజయం సాధించి ఉండేది కాదు.
సరే గతం గతః, ఇప్పుడు జగన్ సీఎం అయ్యాడు. మళ్లీ ప్రధానిగా మోడీ వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది.. జగన్ మోడీ ని ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడా.. లేక సాహో అని చంద్రబాబు లాగే విఫలమవుతాడా..
జగన్ సీఎం అయ్యాక మొదటిసారి మోడీ ఏపీ కి వచ్చాడు. ముఖ్యమంత్రిగా జగన్ స్వాగతం పలికాడు. ఆ సందర్భంగా ఇద్దరి నడుమ ఆత్మీయత వెల్లివిరిసింది. మరి జగన్ ఎంత వరకు మోడీని మెప్పించి రాష్ట్రానికి మేలు చేస్తాడో చూడాలి.