మోడీ సౌత్ పర్యటన సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ కు మోడీ వచ్చాడు.  8 వ తేదీన కేరళ వచ్చిన మోడీ అక్కడి నుంచి మాల్దీవులు, శ్రీలంక దేశాలు వెళ్లి.. 9 వ తేదీ మధ్యాహ్నం తిరుపతి వచ్చారు.  తిరుపతిలో మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో సహా పలువురు నేతలు ఆయనను కలుసుకొని ఘనంగా స్వాగతం పలికారు.  


అక్కడి నుంచి మోడీ తిరుమల వెళ్లారు.  అంతకు ముందు మోడీ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.  మోడీ తిరుమల వెళ్లిన తరువాత.. ఆయన కాన్వాయ్ తిరుమలలో స్వామి వారి ఆలయానికి సమీపంలో ఆగింది.  అక్కడ ప్రధానిని రిసీవ్ చేసుకోటానికి జగన్ రావాలి. 


మోడీ కారు దిగి దాదాపు రెండు నిమిషాల పాటు జగన్ కోసం వెయిట్ చేశారు.  జగన్ వెనుక నున్న కారులో నుంచి దిగి ప్రధాని దగ్గరకు వచ్చేసరికి కాస్త ఆలస్యం అయ్యింది.  మోడీ కూడా జగన్ కోసం వెయిట్ చెయ్యడం విశేషం.  అయితే, జగన్ సాంప్రదాయ బద్దంగా పంచె షర్ట్ ధరించిమెప్పించాడు.  


వేద మంత్రోత్సారణాల మధ్య మోడీ గుడిలోకి వెళ్లి స్వామివారి దర్శనంచేసుకున్నారు .  వీరితో పాటు గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: