మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసి సోదరుడు చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి ఆరోగ్యం ఏ మాత్రం బాగులేదని న్యూస్ వచ్చింది.  ఈ న్యూస్ చాలా ఆలస్యంగా రావడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు.  ఎందుకు ఈ విషయాన్ని దాచారో అర్ధం కావడం లేదు.  


ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను హుటాహుటిన లండన్ కు తీసుకెళ్లారని తెలుస్తోంది.  అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది.. ఎందుకు అలా అయింది అనే విషయంలోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం పాతబస్తీలో అక్బరుద్దీన్ పై కొందరు దాడి చేశారు.  ఆ దాడిలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి.  


చికిత్స పొందుతూ ఎక్కువ రోజులు హాస్పిటల్ లోనే ఉన్నారు.  గాయాలకు శస్త్రచికిత్సలు కూడా చేసినట్టు తెలుస్తోంది.  ఆపరేషన్స్ తరువాత ప్రాణాపాయం నుంచి బయటపడినా.. తరచుగా అనారోగ్యం ఆయన్ను వెంటాడుతున్నది. రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే అక్బరుద్దీన్ ఒవైసి సడెన్ గా కనిపించడం లేదు.  


రంజాన్ పండుగ రోజున ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటిన లండన్ కు తరలించినట్టు తెలుస్తోంది.  మెరుగైన వైద్యం కోసమే లండన్ కు తీసుకెళ్లారని.. ఆరోగ్యం విషయంగా ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు మజ్లీస్నాయకులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: