గత కొంత కాలంగా టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  టీడీపీ తరుపు నుంచి అప్పట్లో వైసీపీ నేతలపై ఏ రేంజ్ లో విరుచుకు పడాలో ఆ రేంజ్ లో విరుచుకు పడింది.  ఆ మద్య సోషల్ మీడియాలో ప్రతిరోజూ  యామిని సాధినేని గురించే హాట్ టాపిక్ నడిచింది.  ఇప్పుడు వైసీపీ అధికార పార్టీగా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యలు చేపట్టారు. 

నేడు ఆయన సచివాలయంలో కేబినెట్ మిటింగ్ లో పలు సంచలన విషయాలపై నిర్ణయం తీసుకోబోతున్నవిషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేయడం పై వివాదం నడుస్తుంది.  ‘తిరుపతి పర్యటన లో భాగంగా విచ్చేసిన ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకునేందుకు లైన్లో నిలబడి మరీ వెంపర్లాడిన మా పులివెందుల పులి.. వీడా మోడీ మెడలు వంచి మనకు హోదా, రైల్వే జోన్ తెచ్చేది’ అంటూ పోస్ట్ చేయడం అటు ఏపి ప్రజలకు, వైసీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు..టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

కాకపోతే యామిని సాధినేని పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్‌‌ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఆమె పేరుతో రెండు అకౌంట్లు ఉండటం.. అందులో ఒకటి మాత్రమే వెరిఫైడ్ ఉంది. రెండో అకౌంట్ నుంచి ఈ పోస్టు చేసినట్లు కనిపిస్తోంది.. కానీ రెండు అకౌంట్లు అఫిషియల్ ప్రొఫైల్ పేరుతో ఉన్నాయి.  తాజాగా ఈ వివాదం పై  యామిని స్పందించారు. తన పేరుతో ఫేక్ ప్రొఫైల్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశారని.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.. త్వరలోనే ఈ వ్యవహారంపై సీఎం జగన్‌ను కలుస్తానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: