టీడీపీ అధికార ప్రతినిధిగా అనతి కాలంలోనే సంచలన వ్యాఖ్యలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక పేరుని సంపాదించుకున్నారు యామిని సాదినేని.అలాంటి యామిని సాదినేని ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడం తో గత కొద్దిరోజులుగా మౌనం గా ఉన్నారు.ఇప్పుడు ఉన్నటుండి మీడియా ముందుకి వచ్చి తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని కేస్ ఫైల్ చేశారు.

ఎన్నికల ముందు నాయకులందరిని మంచి చెడూ లేకుండా ఇష్టమొచ్చిన్నట్టు తిట్టేసారు.దానికి ఆ నాయకులు అభిమానులు తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే వారిని తీసుకువెళ్ళి జైలులో వేయించి వాళ్ళ పై చేయి చేసుకున్నారని గతం లో ఆరోపణలు ఎదుర్కున్నారు.ఇప్పుడు వారిలో కొందరు ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా యామిని సాదినేని డి.జి.పి కి ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కోన్నారు.

తనకు అర్ధ రాత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని అలాగే ఫేస్ బుక్ లో తన పేరు మీద నకిలీ అక్కౌంట్ల ను తెరిచి ఇబ్బందికర పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరి పోలీసులు యామిని సాదినేని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేస్తారా అనేది తెలుసుకోవడానికి మరి కొంత కాలం వేచి ఉండాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: