రేణిగుంటలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీవారి నామస్మరణతో తెలుగులో ప్రసంగం మొదలుపెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కి కేంద్రం నుండి పరిపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని బలమైన నాయకుల్ని ఎన్నుకున్నారని ప్రశాని మోదీ అన్నారు

 

రెండో సారి ప్రధానిగా ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతఙతలు తెలుపుతూ తనదైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రధాని మోదీ తెలిపారు.అవినీతి రహిత పాలన అందించినందుకే మరోసారి అధికారం ప్రజలు ఇచ్చారని రెండు సార్లు ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసామన్నారు

 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బలమైన ప్రభుత్వం ఏర్పరిచాడు. కేంద్రం ఎప్పుడూ ఆంధ్ర రాష్త్ఱ అభివృద్ది కోసం కృషి చేస్తుందని అన్నారు.అధికారంలోకి రావటం కంటే అధికారంతో ప్రజలకు సేవ చేయడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ ప్రసంగించిన తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ ఖచ్చితంగా సహాయం చేసే అవకాశం మాత్రం ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: