2019 ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీలో కొత్త ఉత్సాహం నిండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీయార్ రావాలి. టీడీపీ పార్టీను ఫలితాలు చాలా దెబ్బతీసాయి. 175 స్థానాల్లో 23 స్థానాలు మాత్రమే గెలుచుకోవటంతో పార్టీ శ్రేణుల్లో ఇంతకు ముందు ఉండే ఉత్సాహం అంతా ఆవిరైంది.

 

సమయంలో పార్టీని రక్షించాలంటే మాత్రం జూనియర్ ఎన్టీయార్తోనే సాధ్యం. జూనియర్ సినిమాలు పూర్తిగా మనేకపోయినా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కూడా పాలు పంచుకుంటే తాత స్థాపించిన పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం వీరాభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా జూనియర్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.

 

నారాలోకేశ్ కు కూడా ఫలితాలు చాలా భాదపెట్టాయి. ముఖ్యమంత్రి కొడుకుగా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును చూసుకోవాల్సిన లోకేశ్ పరాజయం టీడీపీ పార్టీని చాలా కలవరపెట్టింది. జూనియర్ లోకేశ్ కలిసి చంద్రబాబు సూచనలతో పార్టీ అభివృధ్ధి కోసం పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది పార్టీ అభివృద్దికి దోహదపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: