పవన్ కళ్యాణ్ .. ఎన్నికల ప్రకారం సమయంలో కొన్ని మీడియా సంస్థలు అయన ప్రచారాన్ని పక్కన పెట్టాయి.  ఎన్నిక పూర్తయ్యాయి.  పవన్ పార్టీ జనసేన దారుణంగా ఓడిపోయింది.   ఈ ఓటమి తరువాత పవన్ ఓటమి గురించిన  విశ్లేషణ జరిగింది.  ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డాడు.  

ఎందుకలా జరిగింది.  పవన్ ఎందుకు సదరు వ్యక్తిపై విరుచుకుపడ్డాడు.  తెలుసుకునే  ప్రయత్నం చేద్దాం.  పవన్ కళ్యాణ్ ఓటమిపై రివ్యూ చేసే సమయంలో ఓ అభిమాని పవన్ ను ఓ సలహా ఇచ్చాడట.  అదేమంటే.. ఎన్నికల ప్రచారం సమయంలో...  ప్రజాక్షేత్రంలో పవన్ ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడట.  

ఆ అభిమాని చెప్పినదంతా విని.. చివరకు ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేశారని ప్రశ్నించారు.  సదరు అభిమాని.. జగన్ కు ఓటు వేశానని చెప్పడంతో పవన్ కు కోపం నషాళానికి ఎక్కింది.  వైకాపాకు ఓటేసి తనకు ఇలాంటి నీతులు బోధిస్తున్నావా అని మండిపడ్డాడు. 

తెలుగుదేశం, వైకాపా వద్దకు వెళ్లి.. తాను జనసేనకు ఓటేశానని చెప్తారా అని ఎదురు ప్రశ్నించాడు.  కోపంతో ఆ అభిమానిని కొన్ని మాటలు అన్నాడు.  దీంతో పవన్ కళ్యాణ్ పై మీడియా విరుచుకుపడుతూ కథనాలు రాసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: