రోజా సెల్వమణి... వైఎస్ జగన్ పిలిచారని హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినట్టు వార్తలు వచ్చాయి.  అమరావతిలో జగన్ తో మాట్లాడి.. ఆమెకు పదవి ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో నిజం లేదని రోజా చెప్పింది. తనకు జగన్ నుంచి కానీ, విజయసాయి నుంచి గాని ఫోన్ రాలేదని చెప్పింది.  

తనకు ఏవేవో పదవులు ఇచ్చారని చెప్పి మీడియాలో హైప్ క్రియేట్ చేశారని, అవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయిందని చెప్పింది.  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారుంటే చాలు.. ఎమ్మెల్యేలు ఎందుకు.. అందుకే మంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదన్నారు. 

ఒకవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను రమ్మని పిలిస్తే వెళ్తానన్నారు రోజా. తాను మంత్రి పదవి రాకపోవడంతో అలిగారని జరుగుతోన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఏపీ మంత్రివర్గంలో పదవి ఆశించిన అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని కూడా రోజా కొట్టిపారేసింది.  

తాను పెళ్లి చేసుకుంది బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని, తాను ఎప్పుడు ఆ సామాజికి వర్గానికి చేసిన అమ్మాయిని అనే చెప్పుకోలేదని అన్నారు.  పదవుల కోసం అలిగానని వస్తున్న వార్తల్లో నిజమ్ లేదని చెప్పింది రోజా.  తాను అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతి వచ్చినట్టు చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: