చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయన  ముమ్మారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి పెద్దయన అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తారని అంతా భావిస్తారు. తమ్ముళ్ళు సైతం చంద్రబాబు తన అనుభవాన్ని అంతా చూపించి  అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ఆశిస్తారు.


అయితే చంద్రబాబు మాత్రం కొత్త నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో నోరు మెదపను అంటున్నారు. కురుక్షేత్రంలో శ్రీక్రిష్ణుడు ఆయుధం పట్టను అన్నట్లుగా బాబు గారు  ఒన్లీ సారధిగా మాత్రమే ఉంటారట. సభలో అదిలించినా బెదిరించినా అంతా తమ్ముళ్ళే చేయాలట. మీరే గట్టిగా మాట్లాడాలి. మీరే ప్రజావాణిని బలంగా వినిపించాలి ఇదీ బాబు గారు తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసింది.


  మరి బాబు గారు ఎందుకు నోరు విప్పరు అంటే దానికి వైసీపీ ఎమ్మెల్యేలు సెటైరికల్ ఆన్సర్ చెబుతున్నారు. ఆయన నోరు విప్పితే ఇక్కడ ఆయన లెక్కలు చెప్పడానికి మేము రెడీగా ఉన్నామని అంటున్నారు. అదేమైనా భయమా లేక జగన్ ముందు తాను నిలబడి మాట్లాడడం ఏంటన్న ఇగోవా. మొత్తానికి బాబు గారు నోరు విప్పను అంటున్నారు. మరి ఇది ఎన్ని రోజుల ముచ్చటో చూడాలి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: