ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసిన తరువాత రాష్ట్రం అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నవరత్నాల అమలుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందుతుంది కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే ఇంకా అభివృద్ది జరిగే అవకాశం ఉంది. 
 
ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి కేంద్రం సుముఖంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సత్సంబంధాల కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ ఒరిస్సా నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నా వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవటానికి కేంద్రం ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. 
 
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే చాలా కంపెనీలు వస్తాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం నుండి వచ్చే నిధులతో రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: