ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజుల పాటు జరగనుంది. బుధ, గురు, శుక్రవారం నిర్వహించి, శని, ఆదివారం సెలవు ప్రకటించారు. తిరిగి సోమ, మంగళవారం రోజన అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు.
తొలి రోజు ప్రారంభమైన సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు ఆధ్వర్యంలో తొలుత వైసీపీ అధినేత, రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. తదురుపరి జగన్ కెబినేట్ లోని మంత్రులు అంజాద్ బాషా షేక్ బేపారి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, నారాయణస్వామి, అనిల్కుమార్ పాలుబోయిన, గౌతంరెడ్డి మేకపాటి, గుమ్మనూరు జయరాం, కన్నబాబు కురసాల, బుగ్గున రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు, బాలినేని శ్రీనివాస్రెడ్డి, ముత్యంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేశ్, తానేటి వనిత, పేర్ని వెంకట్రామయ్య నాని, పినిపె విశ్వరూప్లు ప్రమాణ స్వీకారం చేశారు.
తదుపరి ఎమ్మెల్యేలుగా కట్టుపల్లి భాగ్యలక్ష్మి (వైఎస్సార్సీపీ), ఆదిరెడ్డి భవానీ (టీడీపీ), నాగులపల్లి ధనలక్ష్మీ (వైఎస్సార్సీపీ), కళావతి (వైఎస్సార్సీపీ), జొన్నలగడ్డ పద్మావతి (వైఎస్సార్సీపీ), రజని (వైఎస్సార్సీపీ), ఆర్కే రోజా (వైఎస్సార్సీపీ), రెడ్డి శాంతి (వైఎస్సార్సీపీ), కంగాటి శ్రీదేవి (వైఎస్సార్సీపీ), ఉండవల్లి శ్రీదేవి (వైఎస్సార్సీపీ), ఉషాశ్రీచరణ్ (వైఎస్సార్సీపీ), అబ్బయ్య చౌదరి కొఠారి (వైఎస్సార్సీపీ), అబ్దుల్ హఫీజ్ ఖాన్ (వైఎస్సార్సీపీ), అన్నంరెడ్డి అదీప్ రాజ్ (వైఎస్సార్సీపీ), కొనేటి ఆదిమూలం (వైఎస్సార్సీపీ), గుడివాడ అమర్నాథ్ (వైఎస్సార్సీపీ), బొత్స అప్పలనర్సయ్య (వైఎస్సార్సీపీ), డాక్టర్ సీదిరి అప్పలరాజు, తొగూర్ ఆర్థర్ (వైఎస్సార్సీపీ), అశోక్ బెందాళం (టీడీపీ), కింజరపు అచ్చెన్నాయుడు (టీడీపీ) , ఎం బాబు (వైఎస్సార్సీపీ), గొల్ల బాబురావు (వైఎస్సార్సీపీ), తెల్లం బాలరాజు (వైఎస్సార్సీపీ), వై బాలనాగిరెడ్డి (వైఎస్సార్సీపీ), కరణం బలరామకృష్ణమూర్తి (టీడీపీ), చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (వైఎస్సార్సీపీ), బొల్లా బ్రహ్మన్నాయుడు (వైఎస్సార్సీపీ),గంగుల బ్రిజేంద్రరెడ్డి (వైఎస్సార్సీపీ) , గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ), సింగారెడ్డి చక్రపాణిరెడ్డి (వైఎస్సార్సీపీ), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (వైఎస్సార్సీపీ), ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి (వైఎస్సార్సీపీ), జ్యోతుల చంటిబాబు (వైఎస్సార్సీపీ), చెన్నకేశవరెడ్డి. కే (వైఎస్సార్సీపీ), నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ), కొండేటి చిట్టిబాబు (వైఎస్సార్సీపీ), కరణం ధర్మశ్రీ (వైఎస్సార్సీపీ), పెండెం దొరబాబు (వైఎస్సార్సీపీ), పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి (వైఎస్సార్సీపీ), మట్ల ఎలీజా (వైఎస్సార్సీపీ), శ్రీ గణవెంకటరెడ్డి నాయుడు గణబాబు (టీడీపీ), వాసుపల్లి గణేష్కుమార్ (టీడీపీ), మద్దాలి గిరిధర్రావు (టీడీపీ) ప్రమాణ స్వీకారం చేశారు.
బియ్యపు మధుసూదన్ (వైఎస్సార్సీపీ), మానుగుంట మహీధర్ రెడ్డి (వైఎస్సార్సీపీ), కాసు మహేశ్రెడ్డి (వైఎస్సార్సీపీ), షేక్ మహమ్మద్ ముస్తఫా (వైఎస్సార్సీపీ), బూడి ముత్యాలనాయుడు (వైఎస్సార్సీపీ), డాక్టర్ మేరుగ నాగార్జున (వైఎస్సార్సీపీ), కుందూరు నాగార్జునరెడ్డి (వైఎస్సార్సీపీ), దూలం నాగేశ్వరరావు (వైఎస్సార్సీపీ), తిప్పల నాగిరెడ్డి (వైఎస్సార్సీపీ), మహమ్మద్ నవాజ్బాషా (వైఎస్సార్సీపీ), చెట్టి ఫాల్గుణ (వైఎస్సార్సీపీ), కొలుసు పార్థసారథి (వైఎస్సార్సీపీ), కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైఎస్సార్సీపీ), తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి (వైఎస్సార్సీపీ), ముదునూరి ప్రసాదరావు (వైఎస్సార్సీపీ), ధర్మాన ప్రసాదరావు (వైఎస్సార్సీపీ), నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి (వైఎస్సార్సీపీ), రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి (వైఎస్సార్సీపీ), కోన రఘుపతి (వైఎస్సార్సీపీ), శెట్టిపల్లి రఘురామిరెడ్డి (వైఎస్సార్సీపీ), దాడిశెట్టి రాజా (వైఎస్సార్సీపీ), జక్కంపూడి రాజా (వైఎస్సార్సీపీ) ప్రమాణం చేశారు