2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్నెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి వర్గంలో స్థానం లభించలేదు. రోజాకు మంత్రి పదవి రావాలని సామాన్య ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలు భావించారు.కానీ అంచనాలకు భిన్నంగా రోజాకు మంత్రి పదవి ఐతే లభించలేదు

 

కానీ సీ ఎం జగన్ రోజాకు ఏపీఐఐసి చైర్మన్గా నామినేటెడ్ పదవి ప్రకటించాడు. ప్రస్తుతానికి రోజాకు నామినేటెడ్ పదవితో వైసీపీ రోజాను సంతృప్తి పరచింది.ఇప్పుడు నామినేటెడ్ పదవితో సరిపెట్టినా భవిష్యత్తు కేబినేట్ మంత్రివర్గంలో తనకు తప్పకుండా చోటు వస్తుందని రోజా భావిస్తోంది.

 

కుల సమీకరణాల వల్లే తనకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు అని రోజా అన్నారు. ఏదేమైనా రోజాకు పదవి లభించడం సంతోషించదగిన పరిణామమే. వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ అతికొద్ది మంది ముఖ్యుల్లో రోజా ఒకరు. అలాంటి రోజాకు పదవి లభించటం పార్టీ కార్యకర్తలను, నాయకులను ఆనందపరిచే విషయమే


మరింత సమాచారం తెలుసుకోండి: