ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనసేన వైసీపీ టీడీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ జనసేన ఊహించినంత స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే సాధించడంతో జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా చాలా ఎదగాల్సి ఉంది

 

ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ ప్రణాళిక ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు.2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన పార్టీని మరలా పవన్ కల్యాణ్ విధంగా పుంజుకునేలా చేస్తాడో అర్థం కావట్లేదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని జనసేన ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తే మాత్రమే పార్టీ భవిష్యత్తులో ఎటువంటి సమస్యా ఉండదు

 

దీనికి తోడు పార్టీలో ముఖ్య నేతగా ఉన్న రావెల కిషోర్ బాబు పార్టీని వీడి జనసేన పార్టీపై ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీకి ఇది కూడా అంత మంచిది కాదు.పాతికేళ్ళ ప్రస్థానం అని పార్టీ మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ సమస్యలన్నీ అధిగమించి 2024 లోపు పార్టీని విధంగా ముందుకు నడిపిస్తాడో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: