- రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేతలు దుర్మరణం
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, ఆరు5 కార్లలో వైసీపీ నేతలు, అభిమానులు బుధవారం అర్ధరాత్రి అమరావతికి బయలుదేరారు. ఈ తెల్లవారు జామున తుని పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మాపురానికి చెందిన పప్పల నారాయణమూర్తి (69), గోరింట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బీఎల్ నాయుడు (55) అక్కడికక్కడే మృతి చెందారు.
కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని తుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా లో వైసీపీ క్రియాశీలక నాయకులను కోల్పోవడంతో సుపీకేర్ తమ్మినేని సీతారాం ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిని వారిని వెంటనే మెరగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.