ఈ రోజు అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపుల పై జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇలా స్పందించారు.
'' సీఎం ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉంది. 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా? గెలిచిన నాలుగురోజుల్లోనే పార్టీ మారారు.
అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తిగారు మీకంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారు. ఆ చరిత్రను ఒకసారి చూసుకోండి. తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్నవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలి.... '' అని చంద్రబాబు వివరించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి పార్టీ మారారు ? అంటూ చరిత్రను తవ్విన బాబు పై ఇంకా ఐఎస్సార్సీపీ పార్టీ ఇంకా స్సందించ లేదు.
కానీ 1978 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేలింది.
ఇదిగో 1978 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల జాబితా..
ఒక్కసారి చూడండి రాజశేఖర రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించాడో తెలుస్తుంది..