ఈ వార్తా నిజమో కాదో తెలియదుగాని, సోషల్ మీడియా లో మాత్రం విపరీతంగా హల్చల్ చేస్తోంది. తెలుగులో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతగా అలరిస్తుందో అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కు రెడీ అవుతున్నది.
అయితే ఈ కార్యక్రమం మొదలుకాక ముందే, ఎన్నో సంచలనాలకు దారితీసింది. హోస్ట్, కంటెస్టెంట్ కు సంబంధించిన వార్తలు అవి. ఇప్పుడు ఇలాంటి వార్త మరొకటి బయటకు వచ్చింది. ఈసారి ఈ సీజన్ లో ఒక రాజకీయ నాయకురాలు అడుగు పెట్టనుందని సమాచారం.
తాను రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో హీరోయిన్ కూడా. అందుకనే తనకు అవకాశం ఇచ్చారని వార్త ప్రచారంలో ఉంది. కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన హీరోయిన్ మాధవీలతా ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాజకీయాలు తనకు కలసిరాకపోవడంతో మల్లి తన కెరీర్ పై దృష్టిపెడుతుందని అంటున్నారు. కాగా ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది. అయితే ఒకవేళ నిజంగానే ఈ బీజేపీ నేత గనక ఈ షోలో పాల్గొంటే ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. రాజకీయాల్లో ఉండే నేతలు ఇలా రియాలిటీ షోల్లో పాల్గొంటే.. నిజంగా చాలా బాగుంటుంది. వాళ్ళ అసలు రంగు ఏంటన్నది తెలిసిపోతుంది.