అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల గురించి  చర్చించే వేదిక.  ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీలో ప్రత్యేక   తెరలు  ఏర్పాటు చేసి   స్పెషల్  షో ఏర్పాటు చేస్తుంటారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి డిజైన్లు గురించి అప్పట్లో  ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

 

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రత్యేక ప్రదర్శన ద్వారా సభకు వివరించారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శన గురించి టాపిక్ వచ్చింది.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిని   తీవ్రంగా దుయ్యబట్టారు జగన్.  చంద్రబాబు గురించి సొంత మామ ఎన్టీఆర్ ఏమన్నారో అసెంబ్లీలో తెరవేసి  చూపించ మంటారా అంటూ సవాల్ విసిరారు.

 

ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలోని అవినీతిని ఎండగట్టాలని  జగన్ నిర్ణయించారు.  సాగునీటి టెండర్లు సహా అనేక కుంభకోణాలను బయట పెట్టాలని ఆలోచిస్తున్నారు.  ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతి గురించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

చంద్రబాబు గురించి ప్రత్యేక   షో వేసి చూపించ మంటారా  అంటూ జగన్ అన్న మాటలు  యధాలాపంగా అన్నది కావని..  ఈ మాటల వెనుక చాలా నిగూడార్థం ఉందని వారు భావిస్తున్నారు.  అదే జరిగితే..  ఏపీ రాజకీయాలు మరింత హాట్ గా  మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: