తెలంగాణలో కొంత కాలంగా బీజేపీలో ముఖ్య నేతగా ఉంటూ వస్తున్న కిషన్ రెడ్డి ఇటీవల సికీంద్రబాద్ నుంచి లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కేంద్రంలో పీఎం మోడీ కేబినెట్ లో ఆయన కీలక పదవి దక్కించుకున్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మద్య ఆయన హైదరాబాద్ కి విచ్చేశారు.
తాజాగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని చంపేస్తామని ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా అజ్ఞాత వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతుండడంతో మంత్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ఆయనకు ఇలాంటి కాల్స్ పలుమార్లు వచ్చాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉండటంతో కిషన్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్కాల్స్ వస్తున్నాయన్న దానిపై నిఘా పెట్టారు.