గతకొంత కాలంగా భారత్ పై ఉగ్రవాదులు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ దాడులు చేస్తూనే ఉన్నాయి.  తాజాగా జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో తుపాకులు మల్లీ  గర్జించాయి. జిల్లాలోని అవంతిపొరా పరిధిలో ఉన్న బ్రాబందిన ప్రాంతంలో ఈరోజు జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నా యి. వివరాల్లోకి వెళ్తే  బ్రాబందిన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గాలింపు చేపట్టారు.


అయితే  జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.  ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులను జవాన్లు కాల్చి చంపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన టెర్రరిస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: