నిజంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించే వార్తే ఇది. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అవ్వటానికి తీవ్రంగా కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబునాయుడు ఒప్పందం చేసుకున్నట్లు సిఎన్ఎన్ న్యూస్ 18 చెబుతోంది. మొన్నటి వరకూ పికెను అమ్మనాబూతులు తిట్టిన ఇదే చంద్రబాబు అదే  పికెతో ఒప్పందం కుదుర్చుకోవటం విచిత్రంగానే ఉంది.

 

ఎన్నికల షెడ్యూల్ మొదలైన దగ్గర నుండి పికె ను చంద్రబాబు తిట్టని రోజంటూ లేదు. పికెని చంద్రబాబు బీహార్ దొంగగా ఎన్నోసార్లు వర్ణించారు. అలాంటిది ఇదే పికెతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ సిఎన్ఎన్ రిపోర్టర్ రిషికా సదమ్ తన ట్విట్వర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దాంతో జాతీయ మీడియాలో అదో పెద్ద సంచలనంగా మారింది.

 

నిజంగా పికెతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకునుంటే అది సిగ్గుమాలిన చర్య అనే చెప్పాలి. పికెని బండ బూతులు తిట్టిన చంద్రబాబు ఏ విధంగా ఒప్పందం చేసుకుంటారు ? అది కూడా ఎన్నికలు పూర్తయి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. అంటే జగన్ సిఎం అయిన తర్వాత కానీ బీహార్ దొంగ సామర్ధ్యమేంటో చంద్రబాబుకు అర్ధం కాలేదా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: