2014 ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రం చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉంది . కానీ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం పొదుపుగా ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అవసరానికి మించే ఖర్చు చేసాడు. చంద్రబాబు ఖర్చు చేసిన డబ్బులో అవసరం ఉన్నవాటికంటే అనవసరమైన వాటికి చేసిన ఖర్చే ఎక్కువ.

 

చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు.నవ నిర్మాణ దీక్షలని, చెట్టు నీరు పథకమని దుబారాగా చాలా డబ్బు ఖర్చు పెట్టారు . తన పథకాల ప్రచారం కోసం పేపర్ ప్రకటనలకు, టీవీ ప్రకటనలకు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టాడు చంద్రబాబు

 

కానీ 2019 ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు చాలా మారాడు. డొమెస్టిక్ ఫ్లెయిట్లలోనే ప్రయాణిస్తున్నాడు. ఒకప్పుడు హిమలయ వాటర్ బాటిల్స్ వాడిన చంద్రబాబు ఇప్పుడు మామూలు గ్లాసులోని నీరు త్రాగుతున్నాడు. సమావేశాలను కూడా అతి తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో పూర్తి చేస్తున్నాడు.ఇంత తక్కువ సమయంలో చంద్రబాబు ఎంత మారాడో కదా


మరింత సమాచారం తెలుసుకోండి: