రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ సర్కార్ కూడా వివిధ ప్రాజెక్టులకు, స్కీమ్స్‌కు ముమ్మురంగా నిధులను విడుదల చేస్తోంది.గత రెండు వారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్‌డీఏ గవర్నమెంట్ రాష్ట్రానికి సంబంధించిన రూ.4,200 కోట్ల బిల్లులను క్లియర్ చేయనుంది.

 

కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు పోలవరం ప్రాజెక్టు కోసం రూ.3,000 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా రూ.11,655 కోట్లు ఖర్చుపెట్టింది. ఇందులో కేంద్రం రూ.6,726 కోట్లు ఇచ్చింది. మిగతా డబ్బుల కోసం గత ప్రభుత్వం చాలా సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే మోదీ సర్కార్ నుంచి స్పందన కరువైంది.

 

అయితే ఇప్పుడు జగన్ రాకతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రూ.3,000 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫైల్ తొలిగా ఆర్థిక శాఖ వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి నాబార్డ్‌కు చేరుతుంది. ఈ బ్యాంక్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ అందించిన తర్వాత మిగతా రూ.1,929 కోట్లకు కూడా త్వరలో ఆమోదం లభించనుంది.

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా ఉపాధి హామీ పథకం కింద రూ.708 కోట్లు విడుదల చేసింది. మే చివరి వారంలో కూడా కేంద్రం వివిధ స్కీమ్స్‌ కోసం రూ.534 కోట్లు రిలీజ్ చేసింది.చంద్ర బాబు ప్రభుత్వం చాలా సార్లు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పుడు జగన్ రాకతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న విధి విధానాలు దీనికి కారణమని చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: