టీడీపీ తమ్ముళ్ళ గుండెల్లొ  గునపాలే గుచ్చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పటికే జగన్ కొట్టిన దెబ్బకు కూసాలు కదిలిపోయి ఎక్కడ ఉన్నామో తెలియక సతమత‌వుతున్న టీడీపీ తమ్ముళ్ళకు ఇక ఇంతే, మరేం అద్భుతాలు జరగవంటూ చల్లగా చావు కబురు  చెప్పేస్తే తట్టుకోగలరా


టీడీపీ కుదేలు అయిపోయింది. నిన్నటి ఎన్నికల్లో పార్టీ పతనం పాతాళానికి తాకింది. దాంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది పసుపు నేతలకు, ఇక ఇపుడు జూనియర్ ఎన్టీయార్ లాంటి గ్లామర్ అద్ది అయినా పార్టీని బతికించుకోవచ్చునని కొంతమంది నేతలు ఆశపడుతున్నారు. బాబు అవునన్నా కాదన్నా జూనియర్ వస్తే బాగుపడుతుందన్న నమ్మకం చాలా మందిలో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో జేసీ హాట్ కామెంట్స్ చేసి టోటల్ గా  గాలి తీసేశారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి పేరు ఉంది. ఆయన టాప్ హీరో, సినీ రంగంలో తిరుగులేని యాక్టర్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు. అంతకంటే జూనియర్ ఎక్కువా అంటూ జేసీ చేసిన కామెంట్స్ ఇపుడు తమ్ముళ్ళను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. సినిమా వాళ్ళ వల్ల ఏం కాదు, వారు వస్తే జనం వస్తారు చూస్తారు అంతే. అంతకు మించి ఏం జరగదు. ఇదీ జేసీ విశ్లేషణ. ఇక టీడీపీకి ఎప్పటికీ చంద్రబాబు తప్ప మరో నాయకుడు రాడు  రాబోడు. ఇదీ జేసీ కామెంట్. చూడాలి మరి తమ్ముళ్ళ ముఖాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: