జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో జగన్ చాలా హుందాగా వ్యవహరించారంటూ కితాబిచ్చారు. పులివెందుల నుండి వచ్చిన జగన్  ఇంత హుందాగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని చెప్పటం పార్టీలో కలకలం రేగుతోంది.

 

ప్రత్యేకహోదా విషయాన్ని వదలనని చెప్పిన జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడల్లా ప్రధానమంత్రికి నమస్కారం పెడుతూనే హోదా గురించి అడుగుతునే ఉంటానని చెప్పటం నూటికి నూరుపాళ్ళు నిజమే చెప్పారన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వెళ్ళాల్సింది కాదంటూ కుండబద్దలు కొట్టారు. జగన్ చెప్పిన మాటలు వాస్తవాలు గ్రహించే చెబుతున్నట్లు చెప్పారు.

 

తాను జగన్ కు భయపడి పొగడటం లేదని ఆరు నెలల తర్వాత తానేంటో చూస్తారంటూ చెప్పటం కొసమెరుపు.  బిజెపిలో చేరమని తనకు  ఆ పార్టీ నుండి ఆహ్వానం వచ్చిందంటూ పెద్ద బాంబే పేల్చారు. అయితే తాను బిజెపిలో చేరేది లేంది ఇపుడే చెప్పలేనని అన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: