తెలంగాణ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, సిబ్బంది, సహాయకుల కోసం ప్రభుత్వం ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దాదాపు 4.26 ఎకరాల్లో రూ.126 కోట్లతో ఈ బహుళ అంతస్తు భవనాలను నిర్మించారు. మొత్తం 12 అంతస్తులతో ఐదు బ్లాకులు నిర్మించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మొత్తం 120 ప్లాట్లను ఒక్కొక్కటీ 2500 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు.
అలాగే, సిబ్బంది కోసం మరో 36 ఫ్లాట్లను ఒక్కొక్కటీ వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. సహాయకుల కోసం 120 ఫ్లాట్లను ఒక్కొక్కటీ 325 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లాట్లలో పెద్దల పడకగది, పిల్లల పడకగది, కార్యాలయం, వంటగదితోపాటు స్టోర్ రూం ఉంటాయి. గృహ సముదాయం ఆవరణలో ఒక భద్రతా కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఐటీ, మౌలిక సదుపాయాల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో ప్రత్యేకంగా బ్లాక్ను నిర్మించారు.
మొత్తం ఎనిమిది లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు ఆదర్శనగర్లో, హైదర్గూడలో పాత గృహ సముదాయాలున్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో 2012లో కొత్త వాటి నిర్మాణం చేపట్టారు. కానీ పూర్తి చేసేందుకు ఏడేళ్లు పట్టింది. హైదర్గూడలో జరిగిన కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మొత్తానికి కే.సి.ఆర్ అండ్ కే.టి.ఆర్ లు తమ మంత్రులకు హైటెక్ సిటీ మాదిరి నిర్మాణాలను చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కే.సి.ఆర్ ఒక దిక్చుచి గా పనిచేస్తున్నారు. అతని దూకుడు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో కూడా విజయం తధ్యమని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అతని ప్రత్యర్ధులు మాత్రం పతనం ఆరంభం అయ్యిందని చిలక జోస్యం చెప్తున్నారు.