టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత ఎన్టీఆర్ వస్తే పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని టీడీపీలో ఒక వర్గం భావిస్తుంది. అయితే విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ఇట్టే ఆకట్టుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి. నటుడిగా తనకున్న ప్రత్యేక ఇమేజ్ కు తగ్గట్లే ఆయన రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు.


ఎలాంటి మొహమాటం లేకుండా జగన్ కు మద్దతు ఇవ్వటమే కాదు.. ఆయన గురించి సానుకూలంగా వ్యాఖ్యలు చేసే నటుల్లో పోసాని ముందుంటారు. తాజాగా రాజకీయాల గురించి మాట్లాడిన పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణమైన ఓటమిని సొంతం చేసుకున్న వేళ.. పార్టీ ప్రక్షాళన జరగాలని.. అందుకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై పోసాని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.


జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ పగ్గాలు వెళ్లే ఛాన్స్ ఉందన్న ప్రచారంపై స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి పాలన బాగోనప్పుడు.. అంతా అవినీతిమయమైనప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కైనా.. జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక స్థానం ఉంటుందని.. కానీ జగన్ అలాంటి అవకాశం ఇవ్వరన్నారు. సినీ హీరో ఇమేజ్ వేరు.. రాజకీయాలు వేరని.. జూనియర్ ఎన్టీఆర్ ఎంత చిత్తశుద్ధితో వచ్చినా ఆయన బండి రాజకీయాల్లో నడవదన్నారు. ఒక హీరో రాజకీయాల్లోకి వచ్చి ఆకాశంలో నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు పోయినట్లుగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: