ప్రకాశం జిల్లాలో ఎంఎల్సీ పదవి ఎవరికి ఇవ్వనున్నారో తెలుసా ?  మాజీ ఎంఎల్ఏ బూచేపల్లి శివప్రసాదరెడ్డికి. దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి కాంగ్రెస్ హయాంలో గెలిచారు. మంచి ఫాలోయింగ్ ఉన్న నేత.

 

మొన్నటి ఎన్నికల్లో వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయటానికి వెనకాడారు. జగన్ ఎంతగా ఒత్తిడి చేసినా బూచేపల్లి పోటికి ఇష్టపడలేదు. దాంతో బూచేపల్లే సూచించిన మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ ఇచ్చారు. పోటీ చేయకపోయినా బూచేపల్లి పార్టీకి సిన్సియర్ గా పనిచేయటం వల్ల వైసిపికి దాదాపు 40 వేల మెజారిటి వచ్చింది.

 

దాంతో ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేకంగా పిలిపించుకుని ఎంఎల్సీ టికెట్ ఆఫర్ చేయటంతో బూచేపల్లి కూడా  అంగీకరించారు. అదే విషయాన్ని సోమవారం జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు. దాంతో పార్టీ నేతలంతా ఫుల్లు ఖుషీ అయిపోతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: