అవును అసెంబ్లీ వేదికగా ఈరోజు అరుదైన సంఘటన జరిగింది. ఈ రోజు ఉదయం శాసనసభ లాబీల్లో మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆళ్ళపై పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఎదరుపడ్డారు. ఇద్దరు ఎదురుడపటంతో వెంటనే ఆళ్ళకు ఎన్నికల్లో గెలిచినందుకు లోకేష్ సుభాకాంక్షలు తెలిపారు.

 

సుభాకాంక్షలు తెలపటంతో పాటు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. వెంటనే ఆళ్ళ ధన్యవాదాలు చెప్పారు లోకేష్ కు. అలాగే ఆళ్ళ మాట్లాడుతూ లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.  మంగళగిరిలో పోటీ చేసేటపుడు ఇద్దరు ఒకరిపై మరొకరు ఏ స్ధాయిలో వాగ్బాణాలు సంధించుకున్నారో అందరికీ తెలిసిందే. కాకపోతే ఆళ్ళ దెబ్బకు లోకేష్ చిత్తయ్యారు.

 

విషయం ఏమిటంటే అసలు వీళ్ళద్దరు ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్ ఎంఎల్సీ కావటంతో శాసనసభ లాబీల్లోకి రాగలిగారు. ఎలాగూ టిడిఎల్పీ కార్యాలయం కూడా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు ఒకటే ఉంది. అందుకనే శాసనసభ లాబీల్లోకి లోకేష్ వచ్చినపుడు ఆళ్ళ ఎదురుపడ్డారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: